హైకోర్టు మూసివేత…?

తెలంగాణ హైకోర్టుపై కరోనా మహమ్మారి దాడి చేసింది. ఇప్పటివరకు హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి హైకోర్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. హైకోర్టులోని ఫైల్స్ అన్నింటిని జ్యూడీషీయల్ అకాడమీకి తరలించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైన కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని హైకోర్టు స్పష్టం చేసింది.

error: