29న గీత గోవిందం ఆడియో వేడుక

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన ఆదరణ లభించింది. ట్రైలర్‌ విడుదలైన తొమ్మిది గంటల్లోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. 29న ఈ చిత్ర ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఫిలిం నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకుంది.

error: