60 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

ఈ నెల 14న లేదా 15న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించిన తర్వాత మొదటి జాబితాను విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. మానసరోవర్‌ యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ 12న తిరిగి వస్తారని, 14 లేదా 15న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సుమారు 60 నియోజకవర్గాల్లో ఒకరే ఉన్నారని, రాహుల్‌గాంధీతో జరిగే సమావేశం తర్వాత కాంగ్రెస్‌ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. భాజపా నుంచి వచ్చిన చేరిన నాగం జనార్దనరెడ్డి, తెలుగుదేశం నుంచి రేవంత్‌రెడ్డితోపాటు వచ్చి చేరిన వారిలో కొందరు కూడా ఉన్నారు. నారాయణపేటలో తెరాస నుంచి వచ్చి చేరారు.

ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఉన్న నియోజకవర్గాలకు మొదట విడుదల చేసి, తర్వాత ఇతర పార్టీలతో పొత్తులు, అవగాహనను బట్టి రెండు, మూడు జాబితాలను విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

error: