ముదిరాజ్ లను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం-ఈటల

మంత్రి హరీష్ రావు మీద ఎవడు పడితే వాడు మాట్లాడుతుండు.15 యేండ్ల పాటు ఉద్యమంలో ఉన్నాం.బరిగీసి కొత్లాదుతాం తప్ప,ఎవరితో రాజి పడే ప్రసక్తే లేదు.సత్తాలేని నాయకులే సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.ఖబర్దార్ బిడ్డల్లారా!ఇలాంటి మూర్ఖపు విష ప్రచారాలు ఆపకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు.అని హెచ్చరించారు.ఎన్ని రకాలుగా విషప్రచారం చేసిన ప్రజల మధ్యే ఉండి ఉద్యమిస్తామని,ధర్మాన్ని కాపాడుకుంటామని,వెనకడుగువేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.నాడు కరెంటు అడిగితే కాల్చి చంపిన చంద్రబాబు ఇవాళ అధికారం కోసం కాంగ్రెస్ తో జతకట్టి వస్తున్నాడని,ఆ పార్టీ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.సమైక్య రాష్ట్రంలో మత్స్య కారుల గురించి మాట్లాడింది ఒక తెరాస నే అని,ప్రత్యేక రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడని ఈటెల తెలిపారు.

error: