కూటమి ఒక విఫల ప్రయోగం-కడియం శ్రీహరి

కూటమి ఒక ప్రయోగమే కాదు,తెలంగాణపై అదొక విషప్రయోగం.కాంగ్రెస్ భుజాలపై నుంచి తుపాకి పెట్టి తెలంగాణను కాల్చాలని ఆంద్రబాబు చూస్తున్నాడు.అని కడియం శ్రీహరి ఆరోపించారు.కాంగ్రెస్ నాన్చుడు ధోరణి వల్లనే అమాయక తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారని,తెలంగాణ ద్రోహుల పార్టీ అయినా టీడీపీలో తెల్లంగన వాళ్ళు ఉండకూడదని చెప్పిన కోదండరాం,ఇప్పుడదే తెలంగాణ ద్రోహులతో ఎలా చేతులు కలిపారో ప్రజలకు వివరించాలని నిలదీశారు.కూటమి పొత్తుల కుంపట్ల వల్ల నామినేషన్ల ప్రక్రియ పూర్తికాకముందే తెరాస ఖాతాలో 25 సీట్లు వచ్చి చేరాయని,సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పినట్లుగా నూటికి నూరు పాళ్ళు వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు.వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కు కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు.

error: