బతికితే అతనితోనే బతుకుతాను ,నా నుండి నా భర్తను విడదీయవద్దు .

ప్రేమ ఎంత గుడ్డిదో పంజాబ్ లో జరిగిన ఈ సంఘటన చూస్తే అర్థమైపోతుంది.కామవాంఛలు లేని ప్రేమ అని తండ్రి కూతుర్లుగా చెప్పుకుంటూ హోటళ్లలో పడక సుఖం పొందుతున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరంటే ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేసిన 65 ఏళ్ళ ఉపాద్యాయుడు. ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థినికి దగ్గరై చనువుగా ఉంటూ అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేవాడు.ఆ విద్యార్థిని వయస్సు 20 ఏళ్ళు.వీరిద్దరూ ఏడాది క్రితం పెళ్లి చేస్కుని వేరుకాపురం కూడా పెట్టారు.ఏకాంతంగా గడపాలని భావించి పారిపోయి హోటల్ లో అద్దెకు దిగి ఎంజాయ్ చేస్తూ చివరకు పట్టుబడ్డారు.ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం ,ఉద్యోగ విరమణ పొందిన జయకృష్ణన్, ట్యూషన్ వచ్చే మగత్ అనే విద్యార్థిని పై మమకారం పెంచుకున్నాడు.జయకృష్ణన్ భార్య చనిపోయింది.అతనికి ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.జయకృష్ణన్,మగత్ గతేడాది పెళ్లి చేస్కుని,వేరు కాపురం పెట్టి,సరదాగా ఏకాంతంగా గడపాలని భావించి ఏ నెల 11 వ తేదీన ఇద్దరు ఇల్లు వదిలేసి పారిపోయి తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు.కాగా తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మొబైల్ సిగ్నల్స్ ద్వారా పట్టుబడ్డారు.కాగా మగత్ బతికితే తనతోనే బతుకుతానని ,తాను మేజర్ అని,తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పింది.వారిద్దరిని పంజాబ్ పోలీసులకు అప్పగించాలని రామేశ్వరం కోర్ట్ తీర్పునివ్వడంతో వారు పంజాబ్ కు తిరిగి బయలుదేరారు.

error: