కాంగ్రెస్ కు మరోసారి గుణపాఠం తప్పదు-హరీష్ రావు

గజ్వేల్ లో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం లో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఆ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా మర్చిపోనేలేదు.తెలంగాణ సాధనలో ఉద్యమ గాయాలు ఇంకా మాననేలేదు.మరోసారి తెలంగాణ ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండు పార్టీలు మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.వాటి కుట్రలను తిప్పికొడదాం అన్నారు.డిసెంబర్ 1 న మహాకూటమికి మహాఓటమే మిగులుతుందని,కాంగ్రెస్,టీడీపీ దీ ముగిసిన అధ్యాయంగా తెలంగాణ లో నిలిచిపోతుందని చెప్పారు.తెరాస దీ త్యాగాల చరిత్ర అని తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా త్యజించిన చరిత్ర అని హరీష్ రావు అన్నారు.

error: