దళితుడు స్టేటస్ పెట్టాడని చంపేశారు

కర్ణాటకలోని యశనంతపురంలో ఆదివారం దారుణం జరిగింది. వాట్సప్ స్టేటస్ లో ఫోటోలు పెట్టాడన్న కోపంతో ఓ దళిత యువకుడి ప్రాణాలు తీశారు ఇద్దరు వ్యక్తులు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.ఆంధ్రహళ్లీకి చెందిన అభి ప్రవీణ, మనోజ్ అనే యువకుల ఫోటోలను అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు శ్రీను వాట్సప్ స్టేటస్ లో ఫోటోలు పోస్ట్ చేశాడు.దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు శీను ఇంటికి వెళ్లి అతడిని చాకుతో పొడిచి చంపారు. దీంతో శీను అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులిద్దరు పరారయ్యారు . శీను దళిత సంఘంలో క్రీయాశీలకంగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన రాజాగోపాల్ నగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: